యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)గత నెల సెప్టెంబర్ 27 న దేవర(devara)తో పాన్ ఇండియా లెవల్లో అడుగుపెట్టాడు.చాలా ఏరియాల్లో సరికొత్త రికార్డులని నెలకొల్పిన దేవర ఓవర్ ఆల్ గా ఐదు వందల కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసినట్టుగా  ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.ఎన్టీఆర్ కూడా ఈ విషయంపై తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇటీవలే  ఒక నోట్ ని కూడా రిలీజ్ చేసాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా చెయ్యగా కొరటాల శివ(koratala siva)దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ నిర్మించింది.

తాజాగా  దేవర ఓటిటి రిలీజ్  డేట్ మీద సోషల్ మీడియాలో సరికొత్త వార్తలు వినిపిస్తున్నాయి.నెట్ ఫ్లిక్స్ వేదికగా నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ కానుందని, ఈ మేరకు త్వరలోనే అధికార ప్రకటన రానుందని అంటున్నారు. థియేటర్ రిలీజ్ అయిన  ఆరు వారాల తర్వాత దేవర  రిలీజ్ అవ్వాలనే ఒప్పందం ఉందని గతంలో వార్తలు వచ్చాయి. ఫ్యాన్స్ కూడా యాభై రోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నారు. మరి ఆ తర్వాతే ఓటిటి లోకి వస్తుందా లేక ముందుగానే వస్తుందా అనే విషయంలో మరికొన్ని రోజులైతే గాని క్లారిటీ రాదు. 

 ఇక దేవర మొదటి పార్ట్ విజయంతో రెండో పార్ట్ కోసం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే మూవీకి సంబంధించిన అప్ డేట్స్ రానున్నాయి. కొరటాల శివ ఇటీవల జరిగిన దేవర సక్సెస్ మీట్ లో  మాట్లాడుతు మొదటి పార్ట్ కంటే రెండవ పార్ట్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here