ముంబయికి మిగిలేది రూ.59 కోట్లే
ఐపీఎల్ 2025 సీజన్ వేలం కోసం ప్రతి ఫ్రాంఛైజీకి రూ.120 కోట్లని బీసీసీఐ కేటాయించగా.. రిటెన్ష్ కోసం రూ.75 కోట్ల వరకూ ఫ్రాంఛైజీలు ఖర్చు చేయవచ్చు. దాంతో ఒకవేళ ముంబయి ఇండియన్స్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాని రిటెన్ చేసుకుంటే.. అప్పుడు వారికి వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు, రూ.18 కోట్లు చొప్పున ఇవ్వాల్సి వస్తుంది. అంటే రూ.61 కోట్లు పోతే.. మిగిలిన రూ.59 కోట్లతో వేలానికి వెళ్తుందన్నమాట.