ఏప్రిల్ 24న కేసు నమోదు
సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర పన్నారని ఈ ఏడాది ఏప్రిల్ 24న నవీ ముంబై పోలీసులు 18 మంది నిందితులు, బిష్ణోయ్ ముఠాకు చెందిన ఇతరులపై కేసు నమోదు చేశారు. ముంబైలోని సల్మాన్ ఖాన్ బాంద్రా నివాసం వెలుపల బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు కాల్పులు జరిపిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతని సోదరుడు అన్మోల్, సంపత్ నెహ్రా, గోల్డీ బ్రార్, రోహిత్ గోధారాలను నిందితులుగా ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఈ కేసులో నవీ ముంబై పోలీసులు ఐదుగురు బిష్ణోయ్ ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వారు ధనంజయ్ అలియాస్ అజయ్ కశ్యప్ అలియాస్ నహ్వీ, గౌరవ్ భాటియా, వాస్పి ఖాన్ అలియాస్ వసీం చిక్నా, రిజ్వాన్ ఖాన్ అలియాస్ జావేద్, దీపక్ హవా సింగ్ అలియాస్ జాన్. జూన్ నెలలో నవీ ముంబైలోని పన్వేల్ సమీపంలోని తన ఫాంహౌస్ కు వెళ్తుండగా సల్మాన్ ఖాన్ (salman khan) పై కాల్పులు జరపాలని నిందితులు కుట్ర పన్నినట్లు పోలీసులు పేర్కొన్నారు.