Supreme Court: సుప్రీంకోర్టు కేసులన్నీ త్వరలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరుపుతున్న అన్ని కేసులను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు భావిస్తోంది. అన్ని కేసులను లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి వీలుగా యాప్ బీటా వెర్షన్ ను పరీక్షిస్తున్నట్లు బార్ అండ్ బెంచ్ నివేదిక తెలిపింది. 2022 నుంచి రాజ్యాంగ ధర్మాసనం కేసులను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. అయితే, ఇతర రోజువారీ విచారణలను కూడా రెగ్యులర్ లైవ్ స్ట్రీమింగ్ కోసం పరిగణనలోకి తీసుకోవడం ఇదే మొదటిసారి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here