డిస్కమ్‌లు అన్ని వ‌ర్గాల వినియోదారుల నుండి ఇంధ‌న స‌ర్దుబాటు ఛార్జీల‌ను వ‌సూలు చేయాల‌ని కోరుతున్నాయి. అందులో భాగంగానే గృహ విద్యుత్ వినియోగ‌దారుల నుంచి రూ.2,194 కోట్లు, వ్యవ‌సాయ విద్యుత్ స‌ర్వీసుల‌పై రూ.1,901 కోట్లు, పారిశ్రామిక స‌ర్వీసుల‌పై రూ.2,748 కోట్లు, వాణిజ్య స‌ర్వీసుల‌పై రూ.669 కోట్లు, ఇన్స్టిట్యూష‌న్స్‌పై రూ.547 కోట్లకు పైగా విద్యుత్ భారాలు ప‌డ‌నున్నాయి. అయితే ప్రజ‌ల‌పై భారాలు వేసేందుకు ఏపీఈఆర్‌సీ అనుమ‌తించ‌కుంటే, రూ.8,113.60 కోట్ల‌లో 75 శాతం రాష్ట్ర ప్రభుత్వం భ‌రించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేద‌ని, ప్రజ‌ల‌పైనే భారాలు మోపేందుకు సిద్ధంగా ఉంద‌ని సీపీఎం రాష్ట్ర కార్యద‌ర్శి వ‌ర్గ స‌భ్యులు సీహెచ్ బాబురావు విమ‌ర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here