తుళ్లూరు పీఎస్ లో కేసు నమోదు
ఈ నెల 15న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ దుస్సాహసానికి పాల్పడిన లాయర్ ఎవరో తోటి న్యాయవాదులకు తెలుసని సమాచారం. ఆ లాయర్ పై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారని తెలుస్తోంది. ఏపీ హైకోర్టు విచారణ లాగిన్లను దుర్వినియోగం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇతర లాయర్లు కోరుతున్నారు.