15 రోజులు.. 9 హత్యలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 15 రోజుల్లో మొత్తం 9 హత్యలు జరిగితే అందులో 8 రక్తసంబంధీకుల మధ్య జరిగినవే కావడం విపరీత ధోరణికి అద్దం పడుతోంది. పెరుగుతున్న ఆస్తుల విలువ, మద్యం, వివాహేతర సంబంధాలు, అసూయ తదితరాలు కుటుంబ బంధాల మధ్య అంతరాలను పెంచుతున్నాయి. సోదరుల మధ్య సంబంధాలు చెడిపోతున్నాయి. భార్యాభర్తలు కొందరిలో చిన్న చిన్న కారణాలే హత్యలకు దారితీస్తున్నాయి. ఇటీవల జరిగిన రక్త సంబంధీకుల హత్యల్లో జగిత్యాల జిల్లాలో మూడు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో రెండు చొప్పున హత్యలు జరగగా పెద్దపల్లి జిల్లాలో ఒక హత్య కేసు నమోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here