పాయింట్ల పట్టికలో టాప్‍లోనే..

న్యూజిలాండ్‍తో తొలి టెస్టు ఓడినా ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 పాయింట్ల పట్టికలో భారత్ టాప్‍లోనే ఉంది. ఈ సైకిల్‍లో ఇప్పటి వరకు 12 టెస్టుల్లో 8 గెలిచి, మూడు ఓడి, ఒకటి డ్రా చేసుకుంది భారత్. దీంతో 98 పాయింట్లు, 68.06 శాతంతో ఫస్ట్ ప్లేస్‍లో కొనసాగింది. ఆస్ట్రేలియా (90 పాయింట్లు, 62.50 శాతం), శ్రీలంక (60 పాయింట్లు, 55.56 శాతం)తో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. న్యూజిలాండ్ (48 పాయింట్లు, 44.44 శాతం) నాలుగో ప్లేస్‍లో నిలిచింది. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, వెస్టిండీస్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ సైకిల్ ముగిసే సరికి టాప్-2లో ఉండే జట్లు 2025 జూన్‍లో లార్స్డ్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here