తిరుపతి సభలో సనాతన ధర్మాన్ని ఎవరూ అంతం చేయలేరని, అలా ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్లే కొట్టుకుపోతారంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం ఎప్పటికీ నిలిచే ఉంటుందన్నారు. గతంలో సనాతన ధర్మంపై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ అని దాన్ని నిర్మూలిస్తామని కొందరు అంటున్నారని, వారే కాలంతో పాటు కొట్టుకుపోతారని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ సభలో చేసిన వ్యాఖ్యలపై పలువురు కోర్టు్లో పిటిషన్ దాఖలు చేశారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here