జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూర్ గ్రామానికి చెందిన ముంజల నారాయణ ఆధార్ కార్డును ఉపయోగించి సైబర్ నేరగాళ్ళు మోసానికి పాల్పడ్డారు. నారాయణ ఆధార్ కార్డుపై ఫోటోను మార్చి పాన్ కార్డు సృష్టించారు. పాన్ కార్డు, ఫేక్ ఆధార్ కార్డును ఉపయోగించి హైదరాబాద్ లోని ఏడు ప్రైవేట్ బ్యాంకుల నుంచి రూ.20 లక్షల లోన్ తీసుకున్నారు. ఈ లోన్ 2018 లో తీసుకొని ఇప్పటివరకు రూపాయి చెల్లించలేదు. గత కొద్ది రోజుల నుంచి బ్యాంక్ నుంచి లోన్ అమౌంట్ ఎప్పుడూ చెల్లిస్తారని నారాయణకు ఫోన్ లు రావడంతో అవాక్కయ్యాడు. ఇటీవల ఫేక్ కాల్స్, సైబర్ నేరగాళ్ల ఫోన్లు వస్తుండడంతో అలాంటిదే అనుకోని పట్టించుకోకుండా వదిలేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here