దానా తుపానుతో ఈ రాష్ట్రాలకు రెడ్​ అలర్ట్​..!

ఐఎండీ ప్రకారం.. ఒడిశా, పశ్చిమ్​ బెంగాల్​పై దానా తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని తెలుస్తోంది. అక్టోబర్​ 23న ఒడిశా తీరం వెంబడి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చు. కానీ తుపాను తీరానికి సమీపిస్తున్న కొద్ది, తీరం దాటిన తర్వాత.. అంటే అక్టోబర్​ 24, 25 తేదీల్లో ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. గురువారం పూరీ, ఖుర్దు, గంజన్​, జగత్​సింగ్​ఫూర్​ జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు పడొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here