రెండేళ్ల క్రితం రైల్వే యార్డుల్లో వరుస హత్యలు జరగడంతో అప్పటి సీపీ కాంతి రాణా తాతా నిత్యం యార్డుల్లో పహారా ఉండేలా సిబ్బందిని షిఫ్టుల వారిగా నియమించారు. కొద్ది నెలలకే అది అటకెక్కింది. నిఘా లేకపోవడంతో రైల్వే యార్డుల్లో గంజాయి రవాణా, విక్రయాలు యథేచ్చగా సాగుతున్నాయి. మరోవైపు రైల్వే పోలీసులు తమకు తగినంత సిబ్బంది లేనందున రైల్వే యార్డులు, నివాస ప్రాంతాల్లో నిఘా పెట్టలేమని చేతులెత్తేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ జిఆర్పీ స్టేషన్‌లో 70మంది సిబ్బందికి కేవలం 17మంది మాత్రమే విధుల్లో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here