హిమాచల్ ప్రదేశ్ లో..

ఈ ప్రాజెక్టులో భాగంగా పరిశోధకుల బృందం హిమాచల్ ప్రదేశ్ లోని పశ్చిమ హిమాలయాల్లోని పర్వత ప్రాంతాలను సందర్శిస్తుండగా మట్టి రోడ్డుపై కొన్ని గోధుమ రంగు పాములు కనిపించాయి. మనుషులను చూడగానే, అవి కదలకుండా ఉండిపోయారని, కాటు వేసే ప్రయత్నాలు చేయలేదని అధ్యయనం పేర్కొంది. ఈ పాముల అధ్యయనం, వాటి డీఎన్ఏ విశ్లేషణ, ఇతర పాములతో పోల్చడం కొత్త జాతి ఆవిష్కరణకు దారితీసింది. హిమాచల్ ప్రదేశ్ లోని చంబా, కులు వంటి ప్రాంతాల్లోనే కాకుండా ఉత్తరాఖండ్ లోని నైనిటాల్, నేపాల్ లోని చిత్వాన్ నేషనల్ పార్కులో కూడా ఈ కొత్త జాతిని కనుగొన్నట్లు మిజోరం యూనివర్సిటీలోని జువాలజీ విభాగం ప్రొఫెసర్, పరిశోధకుల బృందంలో సభ్యుడు హెచ్ టీ లాల్రెమ్సంగా తెలిపారు. జీషాన్ ఎ మీర్జా, వీరేంద్ర కె భరద్వాజ్, సౌనక్ పాల్, గెర్నోట్ వోగెల్, పాట్రిక్ డి క్యాంప్బెల్, హర్షిల్ పటేల్ ఈ బృందంలోని ఇతర పరిశోధకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here