తెలంగాణలో గతేడాది సెప్టెంబరులో ఉపాధ్యాయుల బదిలీల జరిగాయి. టీచర్ల ట్రాన్స్‌ఫర్ సమయంలో.. స్పౌజ్‌ పాయింట్లను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా 12 మంది ప్రధానోపాధ్యాయులను సస్పెండ్‌ చేస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. ఈ 12 మందిలో ఒక్క మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే 10 మంది హెచ్‌ఎంలు ఉన్నారు. జనగామ జిల్లా, వనపర్తి జిల్లాలో ఒక్కో హెచ్‌ఎంను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here