ద్వైపాక్షిక భేటీలో జిన్ పింగ్ ఏమన్నారు?

భారత్, చైనాలు మరింత సమాచారం, సహకారాన్ని కలిగి ఉండటం, విభేదాలను సక్రమంగా పరిష్కరించుకోవడం చాలా ముఖ్యమని జిన్ పింగ్ అన్నారు. ఐదేళ్లలో అధికారికంగా తాము సమావేశం కావడం ఇదే తొలిసారి అన్నారు. ‘‘ఇరు దేశాల ప్రజలు, అంతర్జాతీయ సమాజం మా సమావేశంపై ఎంతో శ్రద్ధ కనబరుస్తున్నాయి. చైనా, భారతదేశం రెండూ పురాతన నాగరికతలు. అభివృద్ధి చెందుతున్న దేశాలు. గ్లోబల్ సౌత్ యొక్క ముఖ్యమైన సభ్యులు. ఈ రెండు దేశాలు తమ తమ ఆధునీకరణ ప్రయత్నాల్లో కీలక దశలో ఉన్నాయి. ఇది మన రెండు దేశాల ప్రాథమిక ప్రయోజనాలకు బాగా ఉపయోగపడుతుంది. చరిత్ర ధోరణిని, ద్వైపాక్షిక సంబంధాలను సరైన దిశను కొనసాగించడానికి, ఇరు పక్షాలు మరింత పరస్పర సమచారాన్ని, పరస్పర సహకారాన్ని కలిగి ఉండాలి. విభేదాలను సరిగ్గా పరిష్కరించుకోవాలి’’ అని షీ జిన్ పింగ్ (Xi Jinping) అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here