థియేటర్స్ విజిట్ కు వెళ్లిన ‘లవ్ రెడ్డి’ చిత్రబృందంలోని నటుడిపై ఓ ప్రేక్షకురాలు దాడికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ నిజాంపేట జీపీఆర్ మాల్ మల్టీప్లెక్స్ లో చోటు చేసుకుంది. సినిమా క్లైమాక్స్ చూసి ఎమోషనల్ అయిన ఆ ప్రేక్షకురాలు.. అందులో తండ్రి పాత్రను పోషించిన ఎన్ టీ రామస్వామి అనే నటుడు నిజంగానే ప్రేమజంటను విడిదీశాడని అనుకుని కోపంతో తిడుతూ దాడి చేసింది. 

ఈ ఘటనతో ఆశ్చర్యపోయిన హీరో అంజన్ రామచంద్ర, హీరోయిన్ శ్రావణి, దర్శకుడు స్మరణ్ రెడ్డి మరియు ఇతర టీమ్ మెంబర్స్.. ఆ మహిళను అడ్డుకుని ఆమెకు నచ్చజెప్పారు. రామస్వామి తండ్రి పాత్రలో నటించాడని, అతను సినిమాలో చూపించినట్లు చెడ్డవాడు కాదని మహిళకు చెప్పి, అక్కడి నుంచి పంపించివేశారు. కాగా, ‘లవ్ రెడ్డి’ సినిమా ఈ నెల 18న థియేటర్స్ లో అడుగుపెట్టింది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here