సిద్ధమవుతున్న ప్రభుత్వాలు

దాన తుపానును ఎదుర్కోవడానికి ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి సన్నద్ధతను సమీక్షించారు. అక్టోబర్ 25 వరకు పాఠశాలలు, విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ఒడిశా అధికారులు ప్రకటించారు. ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ (OPSC) ఈ నెల 27న జరగాల్సిన ప్రిలిమినరీ పరీక్ష -2023-24ను వాయిదా వేసింది. పర్యాటకులు, యాత్రికులు, సముద్ర తీర ప్రాంతాలకు, పూరీకి వెళ్లవద్దని, మత్స్యకారులు సముద్రంలోనికి వెళ్లవద్దని సూచించారు. దాన తుఫాను (Cyclone Dana) ఈ రోజు రాత్రి తీరం దాటనుందని, ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమం కొనసాగుతోందని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here