‘జగన్‌ తన సొంత అమ్మ, చెల్లిపై కేసు వేసారని దుష్ప్రచారం చేస్తున్నారు. ఈడీ ఎటాచ్‌మెంట్‌లో ఉన్న ప్రాపర్టీస్‌ ట్రాన్స్ఫర్ చేస్తే జగన్‌ న్యాయపరమైన చిక్కులు వస్తాయని తెలిసి కూడా చేసారు. నాడు టీడీపీ, కాంగ్రెస్‌లు కలిసి కుట్ర పూరితంగా కేసులు పెడితే.. జగన్‌ జైలుకు వెళ్లారు. నేడు స్టేటస్‌ కో ఉన్న ఆస్తులు ట్రాన్స్ఫర్‌ చేసి జగన్‌ను ఇబ్బంది పెట్టాలనే కుట్రలో షర్మిల కూడా భాగం అవుతున్నారు. జగన్‌ బెయిల్ రద్దు అయ్యే పరిస్థితి రాకూడదు కనుకే నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కేస్‌ ఫైల్‌ చేయాల్సి వచ్చింది’ అని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here