టాటా టియాగో ఈవీ సేల్స్ మైలురాయి..

టాటా టియాగో ఈవీని మొదట సెప్టెంబర్ 2022లో ఆవిష్కరించింది సంస్థ. అమ్మకాలు ఫిబ్రవరి 2023లో ప్రారంభమయ్యాయి. డెలివరీలు ప్రారంభించిన నాలుగు నెలల తర్వాత, అంటే మే 2023లో టాటా టియాగో ఈవీ 10,000 యూనిట్ల అమ్మకాల మార్కును తాకింది. గత 17 నెలల్లో 40,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్​బ్యాక్ విడుదల సమయంలో భారతదేశంలో అత్యంత వేగంగా బుక్ అయిన ఈవీగా నిలిచింది. కేవలం 24 గంటల్లో 10,000 బుకింగ్స్ వచ్చాయి. ఈ సంఖ్యను ఇటీవల ఎంజీ విండ్సర్ ఈవీ అధిగమించింది! ఇది 24 గంటల్లోనే విండోలో 15,000 పరిమితిని దాటింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here