ఆధునిక టెక్నాలజీ వినియోగం

నిత్యావసరాల ధరల నియంత్రణ, మార్కెట్ ఇంటర్వెన్షన్లపై అధికారుల కమిటీ సిఫార్సులను మంత్రుల కమిటీ అధ్యయనం చేయనుంది. అలాగే నిత్యావసరాలు, ఆహార పంటల ఉత్పత్తి, సప్లై, నిల్వలకు సంబంధించిన దీర్ఘకాలిక, స్వల్పకాలిక ప్రణాళికల అమలుపైనా సిఫార్సులు చేయాలని కోరింది. ఆధునిక టెక్నాలజీతో నిల్వలు, ఏడాది పొడవునా ధరలు నియంత్రించేందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించింది. మంత్రుల కమిటీ రైతులు, మిల్లర్లు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ,డీలర్లు, ఎగుమతి, దిగుమతిదార్లతో భేటీ కానుంది. సమగ్ర అధ్యయనం తర్వాత మంత్రుల కమిటీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here