యమ దీపం ఎందుకు వెలిగిస్తాం?

ధన్‌తేరస్ రోజున యముడిని, లక్ష్మీదేవి, కుబేరుడు, వినాయకుడు, ధన్వంతరి దేవుళ్ళను పూజిస్తారు. మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున యముడిని ఆరాధించడం, అతనికి దీప దానం చేయడం వల్ల అకాల మరణ భయం తొలగిపోతుంది. యముడిని దక్షిణ దిశకు అధిపతిగా భావిస్తారు. కావున ధన త్రయోదశి రోజున పిండితో చేసిన నాలుగు ముఖాల దీపాన్ని దక్షిణ దిశలో వెలిగిస్తే యమరాజు ఆశీర్వాదం లభిస్తుంది. ఆనందం, శాంతి, ఆరోగ్యం లభిస్తాయని నమ్ముతారు. యమ దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. అలాంటివి ఉన్నా అవి కూడా తొలగిపోతాయనే ఉద్దేశంతో యమ దీపం వెలిగిస్తారు. మృత్యు భయం తొలగిపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here