కాంగ్రెస్ వైఫల్యాలు ఎండగడుతున్నామనే

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వారి వైఫల్యాలు ఎండగడుతున్నామని కేటీఆర్ అన్నారు. ఆరు గ్యారెంటీల మోసం, మూసీ ప్రక్షాళన స్కామ్, బావమరిదికి అమృత్‌ టెండర్లు, ఇలా కాంగ్రెస్ స్కామ్ లను బయటపెడుతున్నామన్నారు. అందుకే బీఆర్‌ఎస్‌ ను ఇబ్బంది పెట్టాలనే రేవ్ పార్టీ అంటూ దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ గత 11 నెలలుగా ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా కేసీఆర్‌ నేర్పిన ఉద్యమబాటలో నడుస్తుందన్నారు. రాజకీయంగా బీఆర్ఎస్ తో పోటీపడలేక, మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోలీసుల అడ్డుపెట్టుకుని దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఆరు గ్యారంటీల అమలు, ఇతర విషయాలపై మంత్రులు సహా కాంగ్రెస్ నేతలు ఏ ఒక్కరూ ముందుకొచ్చి సమాధానం చెప్పే పరిస్థితి లేదన్నారు. అందుకే మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక మా కుటుంబసభ్యులు, బంధువులపై కేసులు బనాయిస్తున్నారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here