IRCTC Maha Kumbh Mela Package : మహా కుంభ మేళాకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 13న మొదలై, ఫిబ్రవరి 26 వరకు మహా కుంభ మేళా నిర్వహిస్తారు. ఈ కుంభమేళా ఒక పవిత్ర సంప్రదాయం. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల వచ్చే అతిపెద్ద మతపరమైన కార్యక్రమం. గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో పుణ్యస్నానం చేసిన వారికి జన్మ, పునర్జన్మల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ వద్ద మహా కుంభమేళా నిర్వహిస్తారు. కుంభ మేళాకు వెళ్లేందుకు తెలుగు రాష్ట్రాల భక్తుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది.