మంచు ఫ్యామిలీలో వివాదం మరింత ముదురుతోంది. పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకోవటంతో మంచు మనోజ్- మోహన్ బాబు మధ్య గొడవ తారా స్థాయికి చేరుకుంది. అటు కాసేపటి క్రితమే దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు మంచు విష్ణు. భారీ సెక్యూరిటీ మధ్య ఇంటికి వెళ్లారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తాయన్నారు. ఫ్యామిలీ వివాదాన్ని పెద్దగా చిత్రీకరించడం తగదన్నారు. త్వరలోనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు మంచు విష్ణు.