పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్ కి వెళ్లడం వలనే  తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయిందని,తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత  గాంధీ హాస్పిటల్ లో అల్లు అర్జున్ కి  వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు,అనంతరం కోర్టులో హాజరుపరచగా పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తు కోర్టు తీర్పుని ఇచ్చింది.దీంతో అల్లు అర్జున్ ని చంచల్ గూడ  జైలుకి తరలించారు.

ఇక ఈ కేసులో అల్లు అర్జున్ తరఫు లాయర్లు క్యాష్ పిటిషన్ వెయ్యడం జరిగింది.దీంతో  అల్లు అర్జున్ కి    హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.దీంతో మరికాసేపట్లో చంచల్ గూడ జైలు నుండి 

అల్లు అర్జున్ విడుదల కానున్నాడు.దీంతో అయన అభిమనుల్లో జోష్ వచ్చినట్లయింది.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here