సందర్శించే పుణ్య క్షేత్రాలు ఇవే..
11 రోజుల పాటు 13 పుణ్య క్షేత్రాల దర్శనంతో ప్యాకేజీని ప్రకటించారు. రాజమండ్రి నుంచి బయలు దేరే బస్సులు భువనేశ్వర్లోని లింగరాజస్వామి ఆలయం, పూరిలోని జగన్నాథస్వామి ఆలయం, కోణార్క్లో సూర్యనారాయణ స్వామి ఆలయం, జాబ్పూర్లో గిరిజా దేవి ఆలయం (శక్తిపీఠం), అలహాబాద్లో బడే హనుమాన్, శ్రీ కళ్యాణిదేవి ఆలయం, త్రివేణి సంగమం, కాశీలో అన్నపూర్ణ, విశాలాక్షి (శక్తిపీఠం), అయోధ్యలో బాలరాముడి మందిరం,సీతామడిలో సీతాసమాహిత్ స్ధల్ (సీతామర్షి ఆలయం), నైమిశారణ్యంలో గోమతి నదీస్నానం, చక్రతీర్థం, రుద్రావర్తం, లలితాదేవి (ఉపశక్తిపీఠం), గయలో విష్ణుపాద ఆలయం, మంగళగౌరీ ఆలయం (శక్తిపీఠం), బుద్ధగయలో బుద్ధుడు జ్ఞానోదయం పొందిన మహాబోధి ఆలయం, అరసవిల్లిలో సూర్యనారాయణ స్వామి దేవాలయం, అన్నవరంలో సత్యనారాయణ స్వామి ఆలయం దర్శనాలు ఉంటాయి.