మాజీ మంత్రి ఆర్కే రోజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తప్పులు చేసి మనం ఓడిపోలేదని వైసీపీ కార్యకర్తలకు చెప్పారు. కూటమి పార్టీల తప్పుడు ప్రచారం వల్ల ఓడిపోయాం అని రోజా అన్నారు. గురువారం నగరిలో వైసీపీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు. ‘జైల్లో పెడతారా..? పెట్టుకో.. కేసులు పెడతారా? పెట్టుకో అని అన్నారు. మళ్లీ మా ప్రభుత్వం వస్తుంది.. వడ్డీతో సహా తిరిగి ఇస్తామని’ కూటమి ప్రభుత్వాన్ని ఆమె హెచ్చరించారు.