పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా ఒక వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే,మరో పక్క తన అప్ కమింగ్ మూవీస్ హరిహరవీరమల్లు(hariharaveeramallu)ఓజి(og)షూటింగ్స్ లో కూడా పాల్గొంటున్నాడు.ఈ రెండిటిలో వీరమల్లు షూటింగ్ కొంచం వేగంగా జరుగుతుండగా ఓజి మాత్రం కొంచం నిదానంగా జరుగుతుంది.దీనికి కారణం వీరమల్లు ని పవన్ ముందుగా రిలీజ్ చెయ్యాలని అనుకోవడమే.అందులో భాగంగానే మార్చి 28 న వీరమల్లు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.
అన్నమయ్య జిల్లా గాలివీడు ఏంపిడివో జవహర్ బాబుపై దాడి జరగడంతో ప్రస్తుతం జవహర్ బాబు కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు.దీంతో పవన్ కళ్యాణ్ కడపలోని రిమ్స్ హాస్పిటల్ కి వచ్చి జవహర్ బాబు ని పరామర్శించి దోషులని కఠినంగా శిక్షిస్తామని చెప్పడం జరిగింది. ఇక పవన్ వచ్చాడనే విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని పవన్ మాట్లాడుతున్న సమయంలో ఓజి,ఓజి అని అరవడం మొదలుపెట్టారు.దీంతో పవన్ అభిమానులని ఉద్దేశించి ఏంటయ్యా మీరు,ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో తెలియదు పక్కకి రండంటూ తన అసహనాన్ని వ్యక్తం చేసాడు.