మహా కుంభమేళా నేపథ్యంలో ప్రయాగ్​రాజ్​కు వెళ్లి, తిరుగు ప్రయాణమయ్యే విమానాల టికెట్​ ధరలకు రెక్కలు వచ్చిన విషయం తెలిసిందే. అనేక విమానయాన సంస్థలు దేశంలోని అనేక చోట్లు సాధారణ టికెట్​ రేట్ల కన్నా 5,6 రెట్లు అధికంగా వసూలు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. భక్తుల సెంటిమెంట్​పై వ్యాపారం చేస్తున్నాయని ప్రజలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహా కుంభమేళాకు వెళుతున్న భక్తులకు ఊరటనిచ్చే విధంగా, విమాన టికెట్​ ధరలను 50శాతం కట్​ చేస్తున్నట్టు పౌరవిమానయాన శాఖ మంత్రి కే. రామ్​ మోహన్​ నాయుడు ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here