అత్యవసర సమావేశం..
అయితే.. అధికారులు ఎవరూ సమావేశానికి రావద్దని ఆదేశాలు వెళ్లినట్టు తెలిసింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతోందనే చర్చ నడుస్తోంది. ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో ఉమ్మడి వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. నాయిని రాజేందర్ రెడ్డి, భూపతి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మురళీ నాయక్, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, లక్ష్మీకాంత్, దొంతి మాధవరెడ్డి, బీర్ల ఐలయ్య రహస్యంగా భేటీ అయినట్టు ప్రచారం జరుగుతోంది.