కేంద్ర బడ్జెట్ 2025 స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే డివిడెండ్ ఆదాయంపై టీడీఎస్ పరిమితిని రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచింది. ఒక స్టాక్ లేదా మ్యూచువల్ ఫండ్ నుంచి ఇన్వెస్టర్ల డివిడెండ్ ఆదాయం ఒక సంవత్సరంలో రూ.10,000 దాటితే మాత్రం 10 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. అయితే, ఈ పరిమితి ఒక స్టాక్ లేదా మ్యూచువల్ ఫండ్ ద్వారా వచ్చే డివిడెండ్ ఆదాయంపై మాత్రమేనని, ఒక ఇన్వెస్టర్ కు తన అన్ని స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల ద్వారా వచ్చే మొత్తం డివిడెండ్ ఆదాయంపై కాదని గుర్తుంచుకోవాలని ఆప్టిమా మనీ మేనేజర్స్ ఎండీ, సీఈవో పంకజ్ మత్పాల్ అన్నారు. డివిడెండ్ ఆదాయం టీడీఎస్ లిమిట్ ను ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం.ౌ