వ్యాసుడు అమ్మవారి ఉపాసనతో వేద విభాగం చేసి, పురాణాలను ఆవిష్కరించి, మహాభారత, భాగవత బ్రహ్మసూత్రాది రచనలు చేసి భారతీయ సనాతన ధర్మ వ్యవస్థకు మూల పురుషునిగా నిలిచాడు. పోతన తన ఆంధ్ర మహాభాగవతంను సరస్వతీ దేవికి అంకితం చేశారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలిపారు.