ఉపాధి హామీకి నిధులేవీ
ఉపాధి హామీ చట్టానికి 2023-24లో రూ.89,154 కోట్లు ఖర్చు చేయగా, ప్రస్తుత బడ్జెట్లో రూ.86 వేల కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. దళిత, గిరిజనులకు బడ్జెట్, సబ్ప్లాన్ కింద చేసిన కేటాయింపులు ఆ వర్గాల అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడడం లేదని పేర్కొన్నారు. ఈ వర్గాలకు కేటాయించిన నిధులను నోడల్ ఆఫీసర్ ద్వారా ఆవాసాలు, రహదారులు, తాగునీరు, విద్య, వైద్య సౌకర్యాలు కల్పిస్తే ఆ వర్గాల్లో కొంతమేరకైనా అభివృద్ధి జరుగుతుందని వివరించారు. దళితులకు 16 శాతం కేటాయించాల్సి ఉండగా, ఐదు శాతం నిధులు మాత్రమే కేటాయించారని విమర్శించారు. గిరిజనులకు ఏడు శాతం నిధులు కేటాయింపునకు బదులు రెండు శాతం కేటాయించారని తెలిపారు.