ఆటగాళ్లకు కూడా వెయిటింగ్
దర్బార్ రాజ్షాహి ఫ్రాంచైజీకి చెందిన కొందరు విదేశీ ఆటగాళ్లకు కూడా చెల్లింపులు జరగలేదని సమాచారం. దీంతో ఢాకాలోని ఓ హోటల్లోనే వారు ఉన్నారని తెలుస్తోంది. టీమ్ మేనేజ్మెంట్ సరైన సమాచారాన్ని ఇవ్వలేదట.ఇప్పటికే ఈ సీజన్ బీపీఎల్ నుంచి ఆ జట్టు ఎలిమినేట్ అయిపోయింది. అయితే, మహమ్మద్ హారిస్, అఫ్తాబ్ ఆలం, మార్క్ డేయల్, ర్యాన్ బర్ల్ సహా మరికొందరు ప్లేయర్లు పేమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారని, హోటల్లోనే ఉండిపోయారని సమాచారం. కొందరి ఫ్రాంచేజీ పావు భాగం చెల్లించగా.. మరికొందికి ఏమీ ఇవ్వలేదని సమాచారం.