ఆధునిక సాంకేతికతతో నేరాలను కట్టడి చేయాలనే ఉద్దేశంతో విజయవాడ కమిషనరేట్ కు ప్రభుత్వం డ్రోన్స్ అందించింది. వీటితో బహిరంగ ప్రదేశాల్లో మద్యం, గంజాయి సేవించే వ్యక్తులను, పాఠశాలలు, కాలేజీ వద్ద ఈవ్ టీజింగ్ చేసే వారిని గుర్తించి, వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. అలాగే పేకాట, కోడి పందేలు వంటి అసాంఘిక కార్యక్రమాలను అడ్డుకునేందుకు పోలీసులకు అవకాశం దొరికింది.