ఉత్తరప్రదేశ్ ఫైజాబాద్ ఎంపీ అవదేశ్ ప్రసాద్ మీడియా ముందు బోరున విలపించారు. ఈ వీడియో హాట్ టాపిక్ గా మారింది. అయోధ్య సమీపంలో అత్యాచారానికి గురైన 22 ఏళ్ల దళిత యువతికి న్యాయం చేయలేకపోతున్నా అని అవదేశ్ ఏడ్చేశారు. యువతికి న్యాయం జరక్కపోతే తన పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. ఎంపీ ఏడ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.