బీఆర్ఎస్ ను కొనేంత డబ్బు
ఆదివారం హనుమకొండలో జరిగిన బీసీ రాజకీయ యుద్ధభేరీ సభలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ వ్యక్తి సీఎం కావటం ఖాయమని అన్నారు. రేవంత్ రెడ్డే చివరి ఓసీ సీఎం అన్నారు. రెడ్డి, వెలమ సామాజిక వర్గం వారు తెలంగాణ వాళ్లే కాదన్నారు. తెలంగాణకు బీసీలే ఓనర్లని, బీసీల ఆర్థికంగా వెనకబడ్డారని నిజం కాదన్నారు. అవసరమైతే బీఆర్ఎస్ ను కొనేంత డబ్బు బీసీల వద్ద ఉందన్నారు. తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలని మల్లన్న డిమాండ్ చేశారు. లేకుంటే ప్రభుత్వాన్నే రద్దు చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.