ప్రతిరోజూ వెల్లుల్లి రెబ్బలు తినాల్సిన అవసరం ఉంది. వెల్లుల్లిలో మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు నిండుగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వెల్లుల్లి తినడం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుంది. గుండెను, రక్తనాళాలను కాపాడడంలో వెల్లుల్లిలోని శోధి నిరోధక లక్షణాలు ముందుంటాయి. కాబట్టి వెల్లుల్లి తరచుగా తినేందుకు ప్రయత్నించాలి. ప్రతిరోజు రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలు తింటే మన శరీరానికి కావాల్సిన తర్వాత నిరోధక శక్తి అందుతుంది. కాబట్టి అప్పుడప్పుడు ఇలా వెల్లుల్లి పులుసును చేసుకొని తినడం వల్ల కూడా ఎన్నో పోషకాలు అందుతాయి. పైగా ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఒకసారి ఈ పులుసును ప్రయత్నించండి. లేదా జ్వరంగా ఉన్నప్పుడు నోరు చప్పగానే పెంచినప్పుడు కూడా ఈ వెల్లుల్లి పులుసు టేస్టీగా అనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here