కాకినాడ తీరంలోని ఎన్టీఆర్ బీచ్ వద్ద పర్యాటకం పడకేసింది. ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదు. గతంలో ఏర్పాటైన బీచ్ పార్క్లో మౌలిక వసతుల కొరత వేధిస్తోంది. సందర్శకులకు ఆహ్లాదం, వినోదం పంచేందుకు ఏర్పాటు చేసిన పార్కులో లేజర్ షోలు అటకెక్కాయి. ఏళ్ల తరబడి సరైన నిర్వహణ లేకపోవడంతో.. ఈ దుస్థితి దాపురించింది.