భారీ భద్రత..
2024 అక్టోబర్ వరకు సచివాలయం భద్రత బాధ్యతలను.. తెలంగాణ స్పెషల్ పోలీస్ చూసింది. ఆ తర్వాత తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కు అప్పగించింది. కమాండెంట్ దేవీదాస్ సచివాలయ ప్రధాన భద్రతాధికారిగా నియమితులయ్యారు. ఆయన నేతృత్వంలో 212 మంది సిబ్బంది భద్రతా విధుల్లో ఉంటారు. వీరే కాకుండా.. హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు శాంతి భద్రతలు, ట్రాఫిక్, ఆక్టోపస్ క్విక్ రియాక్షన్ టీమ్ విధుల్లో ఉంటాయి.