ఐదేళ్లలో రూ.40 లక్షల కోట్లు
గత ఐదేళ్లలో భారత ఈక్విటీల్లో గృహ సంపద రూ.40 లక్షల కోట్లకు పైగా పెరిగిందని, గత మూడేళ్లలో రూ.28 లక్షల కోట్లకు పైగా పెరిగిందని ఎన్ఎస్ఈ తెలిపింది. నిర్వహణలోని ఈక్విటీ ఆస్తుల్లో ఎంత నిష్పత్తిలో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ మెంట్స్ ఉంటాయో అదే నిష్పత్తిలో వ్యక్తుల వద్ద ఉంటాయని నివేదిక భావించింది. మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ భారత ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లపై విశ్వాసం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సెప్టెంబర్ 2024 నాటికి, వ్యక్తిగత పెట్టుబడిదారులు ప్రత్యక్షంగా, పరోక్షంగా భారత స్టాక్ మార్కెట్లో 17.6 శాతం వాటాను కలిగి ఉన్నారని ఎన్ఎస్ఈ పేర్కొంది. ఇది విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల వాటాకు దాదాపు సమానం.