భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చలివాగులో మునిగి పాఠశాల విద్యార్థి మృతి చెందాడు. బాలుడి మృతికి హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యమే కారణమని బాధిత కుటుంబ సభ్యులు హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.