ఎగ్జిట్ పోల్స్ అంచనాలు

  • 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 35 నుంచి 40 సీట్లు, ఆప్ కు 32 నుంచి 37 సీట్లు వస్తాయని మాట్రిజ్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. కాంగ్రెస్ కు 0-1 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది.
  • పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయేకు 51 నుంచి 60 సీట్లు వస్తాయని, ఆప్ కు 10-19 సీట్లు మాత్రమే వస్తాయని తెలిపింది. కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోతుందని పేర్కొంది.
  • పీపుల్స్ ఇన్ సైట్ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీకి 40 నుంచి 44 సీట్లు, ఆప్ కు 25 నుంచి 29 సీట్లు, కాంగ్రెస్ కు 0-1 సీట్లు వచ్చే అవకాశం ఉంది.
  • పి-మార్క్ ఎగ్జిట్ పోల్ బీజేపీకి 39-49 సీట్లు, ఆప్ కు 21-31 సీట్లు, కాంగ్రెస్ కు 0-1 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
  • బీజేపీకి 39-45, ఆప్ కు 22-31, కాంగ్రెస్ కు 0-2 సీట్లు వస్తాయని జేవీసీ ఎగ్జిట్ పోల్ తెలిపింది.

ఫిబ్రవరి 8న ఫలితాలు

70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో మెజారిటీ మార్కు 36. ప్రస్తుతం ఆప్ కు 62 మంది, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ కు ఒక్కరు కూడా లేరు. ఢిల్లీ అసెంబ్లీకి బుధవారం ఎన్నికలు జరగ్గా, ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఢిల్లీలో 1.55 కోట్ల మంది ఓటర్లు ఉండగా, బుధవారం సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 58 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here