మహిళల అండర్-19 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీలో ఛాంపియన్ గా నిలిచి జట్టుకు ప్రాతినిధ్యం వహించిన షబ్నం షకిల్ కు ఘన స్వాగతం పలికారు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి ఇంటి వరకు కారులో ర్యాలీ నిర్వహించారు. ప్రతిష్టాత్మక వరల్డ్ కప్ సాధించిన భారత్ జట్టులో షబ్నం ఉండడం ఆనంద దాయకమని పలువురు అభినందిస్తున్నారు.