సుమారు ఐదేళ్ల తర్వాత ఇక్కడ మ్యాచ్ జరుగుతుండటం, రోహిత్, కోహ్లిలాంటి వాళ్లు ఆడుతుండటంతో ఫ్యాన్స్ టికెట్ల కోసం ఎగబడ్డారు. దీనిని ఊహించని ఒడిశా క్రికెట్ అసోసియేషన్ సరైన ఏర్పాట్లు చేయలేకపోయిందని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. టికెట్లు తీసుకొని బయటకు వెళ్లడానికి దారి లేకపోవడంతో ఈ గందరగోళం నెలకొన్నట్లు అక్కడి అభిమానులు చెప్పారు. కొందరు ఊపిరాడక పడిపోవడంతో వాళ్లను ఆసుపత్రులకు తరలించినట్లు కూడా ఓ అభిమాని వెల్లడించారు. తాగడానికి కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదని వాళ్లు ఆరోపించారు.