సూర్యుడు లేదా ఏదైనా మెరిసే వస్తువును చూస్తే కళ్లు మెరిసిపోతాయి. కానీ ఆ వెంటనే ఆకుపచ్చ లేదా నీలం రంగు కనిపిస్తే కళ్లకు ఉపశమనం లభిస్తుంది. శాస్త్రీయ దృక్పథంలో, ఆకుపచ్చ లేదా నీలం రంగులు… ఎరుపు, పసుపు రంగులను చూడగానే కళ్లకు ఇబ్బందిగా అనిపించేలా చేయవు. ఆకుపచ్చ, నీలం రంగులు కళ్లకు మేలు చేస్తాయి. అందుకే ఆసుపత్రుల్లో కర్టెన్ల నుంచి ఉద్యోగుల దుస్తులు, మాస్క్ ల వరకు ఆకుపచ్చ, నీలం రంగులు అధికంగా ఉంటాయి. దీని వల్ల అక్కడ ఉండే రోగుల కళ్లకు విశ్రాంతి లభిస్తుంది.