సీఐటీయూ ఆగ్రహం..
హాస్పిటల్లో క్యాంటీన్ నడుపుతున్న యాజమాన్యానికి రూమ్ రెంటు లేదు.. కరెంట్ బిల్లు లేదు.. కానీ పేద ప్రజల నుండి టిఫిన్కి 40 రూపాయలు, టీకి 15 రూపాయలు తీసుకుంటున్నారని.. యాదగిరి ఆరోపించారు. ప్రజలను, కార్మికులను దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి బయట ఉన్న హోటల్స్.. బిల్డింగ్ కిరాయి, కరెంటు బిల్.. అన్ని కడుతూ కూడా టిఫిన్ రూ.40కి, టీ రూ.15కే ఇస్తున్నారని వివరించారు. ప్రభుత్వం నుంచి అన్నీ ఉచితంగా పొందుతున్న ఇందిరమ్మ మహిళా శక్తి కాంటీన్ యాజమాన్యం మాత్రం.. అదే రేట్లు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు.