కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కుల గణనపై చేసిన కామెంట్స్ పై వివరాలను ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఇందుకోసం వారం గడువును విధించింది. వివరణ లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.