మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్లో తెలుగమ్మాయి, టీమిండియా బ్యాటర్ త్రిష గొంగడి అదరగొట్టారు. అద్భుతమైన ప్రదర్శన కనబరిచి భారత్ మళ్లీ టైటిల్ గెలువడంతో కీలకపాత్ర పోషించారు. కొన్ని రికార్డులను సృష్టించారు. ప్రపంచకప్లో రాణించిన త్రిష తాజాగా ఐసీసీ అవార్డు రేసులో నిలిచారు. జనవరి నెలకు గాను ఐసీసీ మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు త్రిష నామినేట్ అయ్యారు. మరో ఇద్దరు కూడా రేసులో ఉన్నారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.