రతన్ టాటాతో ఎప్పటి నుంచి పరిచయం?

2013లో తాజ్ సర్వీసెస్ లో విలీనమైన స్టాలియన్ లో మోహిని మోహన్ దత్తా, ఆయన కుటుంబానికి 80 శాతం వాటా ఉంది. స్టాలియన్ లో టాటా ఇండస్ట్రీస్ కు మిగిలిన 20 శాతం వాటా ఉంది. అంతేకాకుండా, దత్తా టిసి ట్రావెల్ సర్వీసెస్ డైరెక్టర్ గా కూడా ఉన్నారు. రతన్ టాటా అత్యంత సన్నిహిత వర్గాలలో దత్తా ఒకరు. 2024 అక్టోబర్ లో టాటా అంత్యక్రియల సందర్భంగా దత్తా మీడియాతో మాట్లాడుతూ తమిద్దరికి 24 ఏళ్ల వయసు ఉన్నప్పుడు రతన్ టాటాను జంషెడ్ పూర్ లోని డీలర్స్ హోటల్లో కలిశానని, అప్పటి నుంచి 60 ఏళ్లుగా ఒకరికొకరు తెలుసునని చెప్పారు. 2024 డిసెంబర్లో ఎన్సీపీఏలో జరిగిన రతన్ టాటా జయంతి వేడుకల్లో కూడా దత్తా పాల్గొన్నారు. దత్తా కుమార్తెల్లో ఒకరు తాజ్ హోటల్స్ లో, ఆ తర్వాత టాటా ట్రస్ట్స్ లో తొమ్మిదేళ్ల పాటు 2024 వరకు పనిచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here